వర్షాలు పడాలని  గంగమ్మ తల్లికి జలాభిషేకం.

నవతెలంగాణ-గోవిందరావుపేట

నోట్ యాడ్ న్యూస్ వర్షాలు కురవాలని మండలంలోని దుంపెల్లి గూడెం మహిళలు గంగమ్మ తల్లికి గురువారం జలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా వైస్ ఎంపీపీ సూది రెడ్డి స్వప్న మాట్లాడుతూ.. ఇప్పటికే వర్షాలు ఆలస్యం అయ్యాయని ఇప్పటికైనా గంగమ్మ తల్లి కరుణించి వానలు కురిపించాలని భక్తితో మహిళలందరూ బొడ్రాయికి మరియు గంగమ్మ తల్లికి బిందెలలో నీరు తీసుకుని వెళ్లి జలాభిషేకం చేయడం జరిగిందన్నారు.
వర్షాలు పడాలని పాటలు పాడుతూ కోలాట నృత్యాలను చేయడం జరిగిందన్నారు. గ్రామీణ ప్రాంతాలన్నీ వ్యవసాయంపై ఆధారపడి ఉన్నాయని వర్షం సకాలంలో పడితేనే పంటలు పండుతాయని ఇకనైనా వర్షాలు రావాలని కోరుకోవడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యురాలు మేడ ఆదిలక్ష్మి తో పాటు పలువురు మహిళలు పాల్గొన్నారు.
Spread the love