ఎల్ఆర్ఎస్ పై పోరు బాటకు కలిసిరండి

– బీఆర్ఎస్  పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన ధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేయండి
– ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి
 నవతెలంగాణ – కమ్మర్ పల్లి 
ఎల్ఆర్ఎస్ పై పోరు బాటకు బాల్కొండ నియోజకవర్గం ప్రజలు కలిసి రావాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి పిలుపు నిచ్చారు. మంగళవారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రంలో  25 లక్షల మంది ఎల్ఆర్ఎస్  లబ్దిదారు ప్రజలపై సుమారు రూ. 20వేల కోట్ల ఆర్థిక భారాన్ని మోపేలా  కాంగ్రెస్ ప్రభుత్వము తీసుకున్న  నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ  బిఆర్ఎస్  పార్టీ ఆధ్వర్యంలో బాల్కొండ నియోజకవర్గంలో  చేపట్టిన నిరసన ధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులకు, ప్రజలకు ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి పిలుపు నిచ్చారు.ఈ ధర్నా కార్యక్రమం బాల్కొండ మండల కేంద్రంలోని బస్టాండ్ వద్ద బుధవారం ఉదయం 10 గంటలకు ఉంటుందని నియోజకవర్గంలోని అన్ని గ్రామాల నుండి ప్రజా ప్రతినిధులు,నాయకులు,కార్యకర్తలు,పార్టీ శ్రేణులు, ఎల్ఆర్ఎస్  లబ్ధిదారులు పెద్ద ఎత్తున హాజరుకావలని ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోరారు.
Spread the love