బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ పార్టీలో చేరిక

నవతెలంగాణ-భీంగల్ : మండలంలోని ముచ్కూర్ గ్రామానికి చెందిన మాజీ ఎంపీటీసీ మాజీ మార్కెట్ కమిటీ డైరెక్టర్ పెద్ద కుమారుడు కైరి  సాగర్ గౌడ్  తోపాటు సచిన్, వినిల్, రమేష్, సునీల్ మరో 50 మంది  కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ముత్యాల సునీల్ కుమార్ సమక్షంలో పార్టీలో చేరారు వీరికి సునీల్ కుమార్ పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు . తెలంగాణ రాష్ట్రంలో ప్రజా సమస్యల పరిష్కారానికి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే నెరవేరుతాయని కనుక కాంగ్రెస్ పార్టీ గెలుపుకు నిరంతరం కృషి చేస్తామని పార్టీలో చేరిన వారు తెలిపారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు పాల్గొన్నారు
ఒక్కసారి అవకాశం ఇవ్వండి
కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బరిలో నిలిచిన ముత్యాల సునీల్ కుమార్ కు ఒకసారి ఎమ్మెల్యేగా గెలిపించాలని ఆయన సతీమణి ప్రజలను కోరారు మంగళవారం పట్టణ కేంద్రంలోని మూడు నాలుగు వార్డులలో కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి ప్రచారం నిర్వహించారు ముత్యాల సునీల్ కుమార్ ప్రజలకు సేవ చేయాలనే సంకల్పంతో ఎల్లప్పుడూ ప్రజలలో ఉంటూ ఏ ఆపద వచ్చిన ప్రజలకు వెన్నుదన్నుగా ఉంటున్న సునీల్  కుమార్ ను ఎమ్మెల్యేగా గెలిపిస్తే మరింత ప్రజలకు దగ్గర సేవ చేస్తాడని కనుక చేతు గుర్తుకు ఓటు వేసి కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని ప్రజలను కోరారు ఈ ప్రచారంలో మండల కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు
Spread the love