మాజీ మంత్రి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరికలు

నవతెలంగాణ-భిక్కనూర్
మండలంలోని పెద్దమల్లారెడ్డి గ్రామానికి చెందిన వివిధ పార్టీల యువకులు, బీబీపేట్ మండలం తుజల్ పూర్, బీబీపేట్ గ్రామానికి చెందిన వివిధ పార్టీల యువకులు సోమవారం మాజీ మంత్రి షబ్బీర్ అలీ  ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి షబ్బీర్ అలీ కాంగ్రెస్ పార్టీలో చేరిన  వారిని పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగుతుందని, అరాచక పాలన అంతం అందించేందుకు రాష్ట్ర అభివృద్ధి కాంగ్రెస్ పార్టీ తోటే సాధ్యమని, బిఅర్ఎస్, బిజెపి పార్టీలు రెండు ఒకటేనని ప్రజలు గ్రహించి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారని అన్నారు. ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయలేక, ఓడిపోతానని తెలిసి ముఖ్యమంత్రిని పోటీ చేయమని ప్రాధేయ పడుతున్నాడని, ముఖ్యమంత్రి కేసీఆర్ పోటీ చేసిన కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడం ఖాయమన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బద్దం ఇంద్రకరణ్ రెడ్డి,డీసీసీ ఉపాధ్యక్షులు మద్ది చంద్రకాంత్ రెడ్డి,మండల అధ్యక్షులు భీంరెడ్డి, గ్రామ అధ్యక్షులు స్వామి, ఎన్ఆర్ఐ సెల్ జిల్లా కన్వీనర్ సుధాకర్ రెడ్డి, కిసాన్ సెల్ జిల్లా ఉపాధ్యక్షులు లింగారెడ్డి, ఎంపీటీసీ మోహన్ రెడ్డి, సీనియర్ నాయకులు బాగారెడ్డి, సురేందర్ రెడ్డి, మన్నే శ్రీను, ఈశ్వర్ రెడ్డి, పెద్ద ఎత్తున పార్టీ నాయకులు పాల్గొన్నారు.
Spread the love