ఫిష్ మార్కెట్ స్థల పరిశీలన చేస్తున్న జాయింట్ డైరెక్టర్

నవతెలంగాణ – కంటేశ్వర్

అర్సపల్లి లో గల ఫిషరీస్ సొసైటీ స్థలం లో 2 కోట్ల తో త్వరలో నిర్మించబోయే హోల్ సేల్ ఫిష్ మార్కెట్ కోసం స్థల పరిశీలన రాష్ట్ర ఫిషరీస్ జాయింట్ డైరెక్టర్ శంకర్ రాథోడ్, నిజామాబాద్ జిల్లా ఫిషరీస్ డీఎఫ్ఓ నరసింహారావు లు సంఘ నాయకులు సోమవారం పరిశీలన చేశారు. ఈ శంకుస్థాపన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమెల్సీ కల్వకుంట్ల కవిత, మత్స్య శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, రోడ్లు భవనాల శాఖ మంత్రి ప్రశాంత్ రెడ్డి, అర్బన్ మెల్సీ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా, ఆర్టీసీ చైర్మన్, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్, ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, బోధన్ ఎమ్మెల్యే శకీల్ పాల్గొంటున్నారు.  తరువాత ఫిషరీస్ అఫీసు జిల్లా కలెక్టరేట్ లో జాయింట్ డైరెక్టర్ శంకర్ రాథోడ్ డీఎఫ్ఓ నరసింహారావు ల కు సంఘ పక్షాన ఘనంగా సన్మనించడం జరిగింది. ఈ కార్యక్రమంలో గంగపుత్ర సంఘం నగర అధ్యక్షులు పల్లికొండ అన్నయ్య, గంగపుత్ర సంఘం న్యాయ సలహా దారులు దుబ్బాక రవి, డి ఎఫ్ సి ఎస్ మాజీ డైరెక్టర్ బట్టు నరేందర్, డిసిసిబి డైరెక్టర్ కె. ఆనంద్, మిట్టపల్లి ఎంపిటిసి బాలగంగాధర్, గంగపుత్ర ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు మాడవేడి వినోద్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
Spread the love