మృతుని కుటుంబాన్ని పరామర్శించిన జేఎస్ఆర్ 

నవతెలంగాణ- హుస్నాబాద్ రూరల్
హుస్నాబాద్ మండలంలోని పందిల్ల గ్రామంలో ఇటీవల మృతి చెందిన పోగుల రాజశేఖర్  కుటుంబ సభ్యులను బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జన్నపురెడ్డి సురేందర్ రెడ్డి పరామర్శించారు. రాజశేఖర్ మృతికి గల కారణాలు అడిగి తెలుసుకున్నారు. ఈ  కార్యక్రమంలో ఎంపీటీసీ  విజయలక్ష్మి, నార్లపురం సత్యం, పూదరి శివలింగం, వెల్దండి సత్యనారాయణ, బొమ్మగాని జగన్నాథం, తాటికొండ శ్రీనివాస్, పినికాశి రాజు, వెల్దండి నరసింహస్వామి తదితరులు పాల్గొన్నారు.

Spread the love