కోర్టులో పోలీస్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహిస్తున్న జడ్జి

– పోలీస్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన జడ్జి భారతి
నవతెలంగాణ-  మంథని
జూన్ 10న జరిగే జాతీయ లోక్ అదాల పై శనివారం మంథని మున్సిపల్ కోర్టు ఆవరణలో సీనియర్ సిబిల్ జడ్జి ఈ.భారతి పోలీస్ అధికారులు, సిబ్బందితో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాజీ మార్గమే రాజా మార్గమని ఆమె అన్నారు.భూ తగాదాల కేసులు,చెక్ బౌన్స్, భార్యాభర్తల కేసులు, కాంపౌండ్బుల్ కేసులు ఉంటే రాజీమార్గంగా కక్షిదారులు ప్రయత్నం చేసుకుని కోర్టుకు రావాలని ఆమె తెలిపారు.ఈ కార్యక్రమంలో మంథని సీఐ సతీష్, ఎస్సైలు వెంకటేశ్వర్, షేక్ మస్తాన్, రాములు, తదితరులు పాల్గొన్నారు.

Spread the love