కవితకు జడ్జి వార్నింగ్..!

నవతెలంగాణ – ఢిల్లీ: లిక్కర్ స్కామ్ కేసులో కవితకి కోర్టు కస్టడీని ఈనెల 23 దాకా పొడిగించింది. సిబిఐ 14 రోజులు కష్టడి కోరగా కోర్టు మాత్రం తొమ్మిది రోజులకి ఒప్పుకుంది. ఈ సందర్భంగా ప్రత్యేక కోర్టు జడ్జి కావేరి కవిత మీద సీరియస్ అయ్యారు. కోర్టు ఆవరణ లో మీడియా తో మాట్లాడటం పై మండిపడ్డారు. జర్నలిస్టు ప్రశ్నలు అడిగితే ఇక్కడ మీరు ఎలా మాట్లాడుతారని ఈ విషయం పై ఫైర్ అయ్యారు ఇంకోసారి ఇలా మాట్లాడొద్దని వార్నింగ్ కూడా ఇచ్చారు. మరోవైపు కవిత విచారణ సందర్భంగా సిబిఐ వీడియో రికార్డు చేసింది లిక్కర్ స్కామ్ కేసులో కవిత మార్చి 15న అరెస్ట్ చేసింది కవిత రెగ్యులర్ బెయిల్ మీద విచారణ ఈనెల 16న జరగనుంది.

Spread the love