![](https://navatelangana.com/wp-content/uploads/2024/01/IMG-20240114-WA0346-200x300.jpg)
ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా గెలుపొందిన జుక్కల్ ఎమ్మెల్యే తోటా లక్ష్మి కాంతారావు ఆదివారం నాడు తిరుమల తిరుపతి దేవస్థానాన్ని సందర్శించి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా దేవస్థాన దర్శనంలో జుక్కల్ నియోజకవర్గం ప్రజలు ఎల్లవేళలా సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో జీవించాలని కోరుకున్నట్లు తెలిపారు. ఎమ్మెల్యే వెంట కాంగ్రెస్ పార్టీ నాయకులు సాయి పటేల్ తదితరులున్నారు.