పార్లమెంట్ ఎన్నికల్లో మళ్లీ కవిత గెలుపు ఖాయం

– లకావత్ నరసింహ బీఆర్ఎస్ పార్టీ మండల కన్వీనర్
నవతెలంగాణ – గోవిందరావుపేట
పార్లమెంట్ ఎన్నికల్లో మళ్లీ కవిత గెలుపు ఖాయమని టిఆర్ఎస్ పార్టీ నూతన మండల కన్వీనర్ లాకావత్ నరసింహ అన్నారు. మంగళవారం మండల కేంద్రంలో ఎంపీ అభ్యర్థి కవిత నామినేషన్ పర్వానికి ఎంపీపీ సూరి శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో పలువురు నాయకులు తరలి వెళ్లారు. ఈ సందర్భంగా నరసింహ మీడియాతో మాట్లాడారు.నాపైన నమకంతో ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్న తనకు  మండల కన్వీర్ గా అదనపు బాధ్యతలు అప్పగించిన జిల్లా పార్టీ అధ్యక్షులు కాకులమర్రి లక్ష్మణ్ బాబు కి అలాగే మాజీ మంత్రివర్యులు ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్ కి ములుగు జిల్లా జడ్పీ చైర్పర్సన్ బడే నాగజ్యోతికి అలాగే మాజీ గ్రంథాలయ చైర్మన్ పోరిక గోవింద్ నాయక్ కి అలాగే గోవిందరావుపేట మండల ఎంపీపీ శ్రీనివాస్ రెడ్డి కి మరియు జడ్పిటిసి తుమ్మల హరిబాబు కి మరియు మాజీ మండల రైతు కోఆర్డినేటర్ పిన్నెటి మధుసూదన్ రెడ్డి మరియు మాజీ సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు మోహన్ రాథోడ్ లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.మీరు నాపై ఉంచిన నమ్మకాన్ని  శిరసా వహిస్తానని పార్టీ కోసం అహర్నిశలు కష్టపడతానని మాటిస్తున్నాను అన్నారు. మరియు ఉద్యమకారులను మరియు మండల కమిటీని మరియు సీనియర్ కార్యకర్తలను ఎంపీటీసీలను మరియు యూత్ కమిటీని  గ్రామ పార్టీ అధ్యక్షులను మరియు మహిళ సోదరీమణులు  పార్టీ కార్యకర్తలు అందరిని కలుపుకొని బిఆర్ఎస్ పార్టీని ముందుకు తీసుకెళ్తానని తెలిపారు.
Spread the love