– ఆమె ఎప్పుడైనా అరెస్టు కావొచ్చు : బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి సయ్యద్ జాఫర్ ఇస్లామ్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ఢిల్లీ లిక్కర్ స్కాంలో కవిత పాత్ర ఉందనీ, ఆమె ఎప్పుడైనా అరెస్టు కావొచ్చని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి సయ్యద్ జాఫర్ ఇస్లామ్ అన్నారు. గురువారం హైదరాబాద్లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో పదేండ్ల నుంచి కేసీఆరే అధికారంలో ఉన్నారనీ, ప్రశ్నలేమో మమ్ముల్ని అడగటం విడ్డూరంగా ఉందని అన్నారు. తెలంగాణలో అమలు చేస్తున్న పథకాలు కేసీఆర్ కుటుంబానికి మనీ మేకింగ్ మిషన్స్గా తయారయ్యాయని ఆరోపించారు. తాము అవినీతి రహిత పాలన అందిస్తున్నామన్నారు. యూపీఏ హయాంలో దేశంలో 12 లక్షల కోట్ల స్కాం జరిగిందని ఆరోపించారు. విపక్షాల కూటమికి బీఆర్ఎస్ మద్దతు ఇవ్వడాన్ని తప్పుబట్టారు. కాంగ్రెస్ పార్టీ కుటుంబం కోసం ఎమ్ఐఎం, బీఆర్ఎస్ పార్టీలు పనిచేస్తున్నాయని విమర్శించారు. తెలంగాణకు సేవ చేస్తాననే ముసుగులో అధికారంలోకి వచ్చిన కేసీఆర్ రాష్ట్రాన్ని దోచుకుంటున్నారని ఆరోపించారు. బీఆర్ఎస్ పార్టీ గత రెండు ఎన్నికల సమయాల్లో మ్యానిఫెస్టోల్లో పొందుపర్చిన అంశాలపైనా, కేసీఆర్ అవినీతిపైనా బీజేపీ పోరాటం చేస్తున్నదన్నారు. రేవంత్రెడ్డి గురించి అందరికీ తెలుసనీ, ఆయన బండారాన్ని త్వరలోనే బయపెడతామని చెప్పారు.