మెదక్‌లో జిల్లా ఎస్పీ కార్యాలయాన్ని ప్రారంభించిన కేసీఆర్‌

నవతెలంగాణ – మెదక్‌: సీఎం కేసీఆర్‌ మెదక్‌ జిల్లాలో పర్యటిస్తున్నారు. కొద్దిసేపటి క్రితమే మెదక్‌ చేరుకున్న ఆయన ముందుగా బీఆర్‌ఎస్‌ పార్టీ జిల్లా కార్యాలయాన్ని ప్రారంభించారు. అనంతరం కార్యాలయంలో ఏర్పాటు చేసిన దేవుళ్ల చిత్రపటాల దగ్గర పూజ చేశారు. ఈ సందర్భంగా అర్చకులు అక్షింతలు వేసి ఆయనను ఆశీర్వదించారు. ఆ తర్వాత జిల్లా ఎస్పీ కార్యాలయాన్ని కేసీఆర్‌ ప్రారంభించారు.  సీఎం వెంట మంత్రి హరీశ్‌రావు, హోంమంత్రి మహమూద్‌ అలీ, రాష్ట్ర చీఫ్‌ సెక్రెటరీ శాంతికుమారి, డీజీపీ అంజన్‌ కుమార్‌ యాదవ్‌, తెలంగాణ మహిళా కమిషన్‌ ఛైర్‌పర్సన్‌ సునీతా లక్ష్మారెడ్డి, మెదక్‌ జిల్లా నేతలు, తదితరులు ఉన్నారు.

 

Spread the love