సిరిసిల్ల జిల్లాలో కేసీఆర్ రోడ్ షో..

నవతెలంగాణ – హైదరాబాద్: కల్వకుంట్ల చంద్రశేఖర రావు రోడ్ షోలతో దూసుకు వెళ్తున్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత తొలిసారి ప్రతిపక్షంలో కూర్చున్న కేసీఆర్… తన పార్టీని లోక్సభ ఎన్నికల్లో ఎక్కువ స్థానంలో గెలిపించేందుకు కృషి చేస్తున్నారు. ఇందులో భాగంగానే బస్సు యాత్రలు అలాగే రోడ్ షోలు నిర్వహిస్తున్నారు. అయితే ఇందులో భాగంగానే మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఇవాళ సిరిసిల్లలో పర్యటించనున్నట్లు జిల్లా టిఆర్ఎస్ అధ్యక్షులు తోట ఆగయ్య తెలిపారు. సాయంత్రం ఐదు గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు సిరిసిల్ల జిల్లా కేంద్రంలో రోడ్ షోలో కేసీఆర్ పాల్గొంటారని వివరించారు. అధిక సంఖ్యలో పార్టీ నాయకులు అలాగే కార్యకర్తలు.. సిరిసిల్ల ప్రజలు ఈ రోడ్ షో లో పాల్గొనాలని కోరారు. కాగా కెసిఆర్ కొడుకు కేటీఆర్ సిరిసిల్ల ఎమ్మెల్యేగా పనిచేస్తున్న సంగతి తెలిసిందే.

Spread the love