కేసీఆర్ రోడ్ షో ను విజయవంతం చేయాలి..

బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు మున్న మల్లయ్య యాదవ్..
నవతెలంగాణ – నూతనకల్
పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో భాగంగా నేడు సాయంత్రం 6 గంటలకు సూర్యాపేట జిల్లా కేంద్రంలో జరిగే బిఆర్ఎస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు రోడ్ షో ను విజయవంతం చేయాలని బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు మున్న మల్లయ్య యాదవ్ కోరారు. మంగళవారం మండల కేంద్రంలోని టిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు, అభిమానులు, మహిళలు, యువత, రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొని కేసీఆర్ కి స్వాగతం పలికి రోడ్ షో ను విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి బత్తుల సాయిలు గౌడ్, నాయకులు చూడి లింగారెడ్డి, గాజుల తిరుమలరావు, భిక్కి బుచ్చయ్య గౌడ్, బత్తుల విద్యాసాగర్, బత్తుల విజయ్, తాడూరు సైదులు గౌడ్, తదితరులు పాల్గొన్నారు.
Spread the love