మునుగోడులో ముస్తాబగుతున్న కేసీఆర్ ఆశీర్వాద సభ ..

– లక్ష మంది కోసం సభ ఏర్పాట్లు…
– ప్రతి గ్రామం నుండి వందలాది మందిని తరలించేందుకు ఏర్పాట్లు..
– కూసుకుంట్ల గెలుపుకు ప్రతి కార్యకర్త ఓ సైనికుల పని చేయాలి…
– కూసుకుంట్ల గెలుపుతోనే మునుగోడు అభివృద్ధి సాధ్యం..
– బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు బండ పురుషోత్తం…
నవతెలంగాణ-మునుగోడు
రేపు మునుగోడు మండల కేంద్రంలోని చౌటుప్పల్ రోడ్ లో నిర్వహించే సీఎం కేసీఆర్ ఆశీర్వాద సభకు ఏర్పాట్లు ముంబరంగ కొనసాగుతున్నాయి. ఈ సభకు లక్షలాదిమందితో ఈ సభను విజయవంతం చేసేందుకు మండలంలోని బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు బండ పురుషోత్తంరెడ్డి ఏర్పాట్లను దగ్గరుండి పరివేక్షిస్తున్నారు. ఈ సందర్భంగా పురుషోత్తం రెడ్డి మాట్లాడుతూ మూడోసారి తెలంగాణ రాష్ట్రంలో గులాబీ జెండా ఎగరవేసేందుకు మునుగోడు మండలానికి వస్తున్న సీఎం కేసీఆర్ సభను విజయవంతం చేసేందుకు మునుగోడు నియోజకవర్గంలోని ఏడు మండలాల నుండి వేలాదిగా తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు. ప్రతి గ్రామం నుండి వందలాదిమంది ప్రజలు తరలివచ్చే విధంగా గ్రామంలోని ప్రతి కార్యకర్త ఒక సైనికుల పని చేయాలని పిలుపునిచ్చారు . నువ్వు కూడా నియోజవర్గం అన్ని రంగాలలో అభివృద్ధి చెందాలంటే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి తోనే సాధ్యమవుతుందని మాయమాటలు చెప్పే కాంగ్రెస్ మాటలను నమ్మొద్దని అన్నారు. ఈ కార్యక్రమంలో పులిపలుపుల ఎంపిటిసి బొల్గురి లింగయ్య , మండల నాయకులు అయితగొని విజయ్ , మునుగోడు వార్డు మెంబర్ ఎడవల్లి సత్యవతి సురేష్ , వెంకన్న , రవి తదితరులు ఉన్నారు.
Spread the love