విజరు దేవరకొండ, సమంత జంటగా నటిస్తున్న పాన్ ఇండియన్ చిత్రం ‘ఖుషి’. శివ నిర్వాణ దర్శకత్వంలో మైత్రీ మూవీస్ నిర్మిస్తున్న ఈ చిత్రం నుంచి థర్డ్ సింగిల్ను రిలీజ్ చేశారు.
”ఖుషి..’ అంటూ సాగే ఈ టైటిల్ సాంగ్ ఇప్పుడు శ్రోతలను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఈ పాటకు శివ నిర్వాణ సాహిత్యం అందించారు. సంగీత దర్శకుడు హిషామ్ అబ్దుల్ వాహబ్ స్వయంగా ఆలపించారు. అంతేకాకుండా ఆయన అందించిన బాణీ ఎంతో వినసొంపుగా ఉంది. ఇక ఇందులో విజువల్స్ మరింత ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ మెలోడీ సాంగ్ యూట్యూబ్లో ట్రెండింగ్ అవుతుందనడంతో ఎటువంటి సందేహం లేదు. ఇప్పటికే ఫస్ట్ సింగిల్ ‘నా రోజా నువ్వే’ వంద మిలియన్ల వ్యూస్ను క్రాస్ చేసింది. ఇన్ స్టాగ్రామ్ రీల్స్, యూట్యూబ్ షార్ట్స్లో ట్రెండ్ అవుతూనే ఉంది. రెండో పాట ‘ఆరాధ్య’ సైతం శ్రోతలను కట్టి పడేసింది. ఇప్పుడు ఈ మూడో పాట ‘ఖుషి’ కూడా చార్ట్బస్టర్ అయ్యేలా కనిపిస్తోంది అని చిత్ర యూనిట్ పేర్కొంది.
ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 1న తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో విడుదల చేయబోతున్నారు.