నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ వంద స్థానాలు గెలవాలనే కేసీఆర్ ఆకాంక్ష నెరవేరాలని తెలంగాణ రాష్ట్ర పోలీసు గృహనిర్మాణ సంస్థ చైర్మెన్ కోలెట్ దామోదర్ తిరుమల శ్రీవారిని వేడుకున్నారు. ఈ మేరకు ఆయన ఆదివారం విడుదల చేసిన ఒక ప్రకటలో తెలిపారు. ఆదివారం ఉదయం ఆయన వీఐపీ బ్రేక్ దర్శన సమయంలో కుటుంబ సభ్యులతో కలసి స్వామివారిని దర్శించుకున్నారు.