– పద్మారావును గెలిపించాలని విజ్ఞప్తి
నవతెలంగాణ- జూబ్లీహిల్స్
బీఆర్ఎస్ సికింద్రాబాద్ పార్లమెంట్ అభ్యర్థి పద్మారావుగౌడ్కు మద్దతుగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్ శనివారం సాయంత్రం హైదరాబాద్ ఎర్రగడ్డ డివిజన్లో పాదయాత్ర నిర్వహించారు. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్తో కలిసి ఆయన ఇంటింటికీ తిరుగుతూ పద్మారావును భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. అలాగే ప్రతి షాపులోనూ వ్యాపారస్తులను పలకరిస్తూ.. కరపత్రాలు పంచుతూ బీఆర్ఎస్ చేసిన మంచి పనులను ఒకసారి జ్ఞాపకం చేసుకొని కారు గుర్తుపై ఓటు వేయాలన్నారు. మహిళలు కేటీఆర్తో సెల్ఫీలు దిగారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ ఎర్రగడ్డ డివిజన్ నాయకులు సల్మాన్, జూబ్లీహిల్స్ ఇన్చార్జ్ సోహెల్, ఎంఎన్ శ్రీనివాస్, డివిజన్ ప్రెసిడెంట్ సంజీవ్, షరీఫ్, జావీద్ తదితర నాయకులు పాల్గొన్నారు.