ఐదు శాతం ఐ ఆర్ ను నిరసిద్దాం

–  అక్టోబర్ 5 వ తేది (గురువారం) నూతన కలెక్టరేట్ ఎదుట జరిగే నిరసన కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం

– ఇప్పుడు మనం ప్రశ్నించకపోతే మరొకసారి అవకాశం రాదు 
– ముష్టి వేసినట్లు ఐ ఆర్ ను ఇచ్చారు
నవతెలంగాణ కంఠేశ్వర్ : ఐదు శాతం ఐ ఆర్ ను నిరసిద్దాం అని, అక్టోబర్ 5వ తేదీ గురువారం నూతన కలెక్టరేట్ ఎదుట జరిగే నిరసన కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని ఇప్పుడు మనం ప్రశ్నించకపోతే మరొకసారి అవకాశం రాదని ముష్టి వేసినట్లు ఐ ఆర్ ను ఇచ్చారని జిల్లా గౌరవ అధ్యక్షులు దత్తాత్రేయరావు జిల్లా అధ్యక్షులు రామ్మోహన్రావు జిల్లా ప్రధాన కార్యదర్శి మదన్మోహన్ అసోసియేట్ ప్రెసిడెంట్ సుదర్శన్ ఇతర కార్యవర్గ సభ్యులు మంగళవారం ప్రకటనలో తెలిపారు.  పెండింగ్ డి. ఎ.ల ఊసే లేదు. భవిష్యత్తులో భరోసా కలిగించే విధంగా ఫిట్ మెంట్ ఉంటుందని ఆశించలేము. ఎన్నికలు వస్తున్న ఈ సందర్భంలో మనం కూడా ఓటర్లమే, గెలుపు, ఓటముల నిర్ణయాధికారంలో భాగస్వాములం అని తెలియజేసే విధంగా ప్రభుత్వానికి ఐక్యతను చాటి మన నిరసనను తెలియజేద్దాం. రండి పెన్షనర్లతోపాటుగా ఉద్యోగ, ఉపాధ్యాయులందరూ కలిసి ఐదవ తేదీ ఉదయం 10-30 గంటలకు నూతన కలెక్టరేట్ కు రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నము అని తెలియజేశారు.
Spread the love