“బార్”కార్యదర్శి కి ప్రశంసపత్రం..

నవతెలంగాణ – కంటేశ్వర్
పదిసార్లు రక్తదానం చేసిన నిజామాబాద్ బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి, సీనియర్ న్యాయవాది భాగీ చరణ్ కు జిల్లా న్యాయసేవ అధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి పద్మావతి అందజేశారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతు ఆరోగ్యవంతుడైన ప్రతి పౌరుడు సామాజిక బాధ్యత గా రక్తదానం చేయాలని కోరారు. న్యాయసేవ సంస్థ చేపడుతున్న కార్యక్రమాలను విజయవంతం చేయడానికి సహకరించాలని,10 జూన్ న జిల్లా వ్యాప్తంగా నిర్వహిస్తున్న జాతీయ లోక్ అదాలత్ కు సంపూర్ణ మద్దతు కూడగట్టుకొని న్యాయఫలాలు న్యాయార్ధులకు అందిద్దామని ఆమె బార్ అధ్యక్షుడు దేవదాసు తో అన్నారు. బార్ ఎల్లవేళలా సంస్థ కార్యాక్రమాలలో పాల్గొని సహకరిస్తున్న విధానాన్ని తెలిపారు.

Spread the love