మద్యం సీసాలు స్వాధీనం

నవతెలంగాణ – అశ్వారావుపేట : బెల్టు దుకాణంలో విక్రయించేందుకు తీసుకెళ్తున్న మద్యం సీసాలను పోలీసులు స్వాదీనం చేసుకున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి. పట్టణం లోని జంగారెడ్డిగూడెం రోడ్డులో బెల్టు దుకాణంలో విక్రయించేందుకు ఓ వ్యక్తి సంచిలో మద్యం సీసాలు తీసుకెళ్తున్నాడు.స్థానిక రింగ్ రోడ్డు సెంటర్లో శుక్రవారం వాహన తనిఖీలు చేస్తున్న ఎస్.హెచ్.ఓ ఎస్సై శ్రీరాముల శ్రీను సంచిలో రూ.5,340 లు విలువ గల సీసాలు గుర్తించారు.మద్యం సీజ్ చేసి సదరు వ్యక్తి పై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.
Spread the love