KKR vs PBKS : కోల్‌క‌తా బ్యాటర్ల విధ్వంసం..మరో భారీ స్కోర్

నవతెలంగాణ-హైదరాబాద్ : ఐపీఎల్ ప‌దిహేడో సీజ‌న్‌లో కోల్‌క‌తా నైట్ రైడ‌ర్స్ బ్యాట‌ర్లు మ‌రోసారి త‌మ బ్యాట్ల‌కు ప‌ని చెప్పారు. సొంత‌మైదానంలో పంజాబ్ కింగ్స్ బౌలర్ల‌ను ఉతికేస్తూ మ‌రోసారి జ‌ట్టుకు కొడంత స్కోర్ అందించారు. దాంతో, కోల్‌క‌తా 6 వికెట్ల న‌ష్టానికి 261 ర‌న్స్ కొట్టింది. ఓపెన‌ర్లు ఫిలిప్ సాల్ట్(75), సునీల్ న‌రైన్(71) అర్ధ శ‌త‌కాల‌తో చెల‌రేగి గ‌ట్టి పునాది వేయ‌గా.. చివ‌ర్లో కెప్టెన్ శ్రేయ‌స్ అయ్య‌ర్(28) వీర‌విహారం చేశాడు. వెంక‌టేశ్ అయ్య‌ర్‌(39 నాటౌట్)తో క‌లిసి ఈడెన్స్‌లో బౌండ‌రీల మోత మోగించాడు. వీళ్లిద్ద‌రూ నాలుగో వికెట్‌కు 43 ర‌న్స్ జోడించారు. దాంతో, పంజాబ్‌కు కోల్‌క‌తా దాదాపు అసాధ్య‌మైన ల‌క్ష్యాన్ని నిర్దేశించ‌గ‌లిగింది.

Spread the love