మద్నూర్ సొసైటీ పరిధిలో 299 మందికి రుణమాఫీ

– సొసైటీ కార్యదర్శి బాబురావు వెల్లడి
నవతెలంగాణ -మద్నూర్
మద్నూర్ మండల కేంద్రంలో గల సింగిల్ విండో కార్యాలయంలో వ్యవసాయ రైతులు తీసుకున్న రుణానికి రాష్ట్ర ప్రభుత్వం సొసైటీ పరిధిలో 299 మంది రైతుల రుణమాఫీ చేస్తూ ఉత్తర్వులు జారీ అయినట్లు సొసైటీ కార్యదర్శి జె బాబురావు బుధవారం విలేకరులతో మాట్లాడుతూ వెల్లడించారు.  రాష్ట్ర ముఖ్యమంత్రి 99 వేల వరకు తీసుకున్న రుణాన్ని మాఫీ చేయడం జరుగుతుందని ఇచ్చిన హామీ మేరకు లక్ష రూపు తీసుకున్న రైతుల రుణాలను మాఫీ ఉత్తర్వులు జారి అయినట్లు ఆయన వివరించారు. 299 మంది రైతుల రుణమాఫీ కి గాను ఒక కోటి 27 లక్షల 87 వేల నాలుగు రూపాయలు మాఫీ చేయడం జరిగిందని ప్రభుత్వం ద్వారా రుణమాఫీ చేసిన రైతులకు వారి ఆధార్ కార్డు రుణం తీసుకున్న పాసుబుక్కు పరిశీలన జరిపి తీసుకున్న రుణాన్ని రుణమాఫీ కింద జమ చేసుకోవడం జరుగుతుందని విండో కార్యదర్శి వెల్లడించారు.
Spread the love