నవతెలంగాణ- మద్నూర్
నూతనంగా ఏర్పడిన డోంగ్లి మండల సర్పంచుల ఫోరం అధ్యక్షునిగా లింబూర్ గ్రామ సర్పంచ్ మధుకర్ పటేల్ ఎన్నికయ్యారు గౌరవ జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్ షిండే గారి ఆధ్వర్యంలో డోoగ్లీ మండల సర్పంచ్ ఫోరం ఆధ్యక్షులు గా మధుకర్ పటేల్ ను ఎన్నుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో మద్నూర్ బీఆర్ఎస్ ఆధ్యక్షులు బన్సీ పటేల్, డోంగ్లి మండల బిఆర్ఎస్ అధ్యక్షులు శేశాoక పటేల్, సొసైటీ చర్మన్ శ్రీను పటేల్, మద్నూర్ సర్పంచ ఫోరం ఆధ్యక్షులు ధరాసవార్ సురేష్ ఉమ్మడి మండల సర్పంచులు పాల్గొన్నారు.