ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్ష కార్యదర్శులుగా మహేందర్ రెడ్డి, నవీన్ 

ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్ష కార్యదర్శులుగా మహేందర్ రెడ్డి, నవీన్
ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్ష కార్యదర్శులుగా మహేందర్ రెడ్డి, నవీన్
నవతెలంగాణ – చేర్యాల: 
చేర్యాల, కొమురవెల్లి, మద్దూరు, దూలిమిట్ట మండలాల ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టుల సమావేశం చేర్యాల మండల కేంద్రంలోని ఓ ఫంక్షన్ హల్లో బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించారు. అనంతరం నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గౌరవ అధ్యక్షులుగా మంతెన చంద్రారెడ్డి, అధ్యక్షులుగా కడుదూరి మహేందర్ రెడ్డి, ఉపాధ్యక్షులుగా కర్క చంద్రారెడ్డి, ఎండి. షాబీర్ పాషా, అశోక్ రాజ్, పిల్లి ఆనంద్, నాగరాజు, ప్రధాన కార్యదర్శిగా రేణిగుంట నవీన్, సహాయ కార్యదర్శులుగా అయిత నందు, సుధాకర్, వినోద్, కోశాధికారిగా బాల లింగం లను ఎన్నుకున్నారు.
Spread the love