టోకెన్ సమ్మె నోటీస్ అందజేత…

10 ,11, 12 లో జరిగే టోకెన్ సమ్మె నోటీస్ అందజేత…
– 10 ,11, 12 లో సీఐటీయు టోకెన్ సమ్మె
నవతెలంగాణ డిచ్ పల్లి:
తెలంగాణ మధ్యాహ్న భోజన పథకం కార్మికుల యూనియన్ (సీఐటీయు) డిచ్ పల్లి మండల కమిటీ ఆధ్వర్యంలో బుధవారం మండల విద్యాధికారికి సమ్మె నోటీస్ ను అందజేశారు.ఈ సందర్భంగా  తెలంగాణ మధ్యాహ్న భోజన పథకం కార్మికుల యూనియన్ (సీఐటీయు)
మండల అధ్యక్షురాలు హరిత, నాయకురాలు ఈశ్వరిలు మాట్లాడుతూ ముఖ్యమంత్రి మధ్యాహ్న భోజన కార్మికులకు రూ.3000 వేతనాన్ని పెంచుతూ సర్కులర్ విడుదల చేసినా, ఇప్పటికీ చెల్లించలేదని, 8 నెలల నుండి బిల్లులు రాక అనేక ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటు న్నామన్నారు. సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 10 ,11, 12 తేదీలలో వంట బంద్ చేసి రాష్ట్ర వ్యాప్తంగా టోకెన్ సమ్మెను నిర్వహిస్తున్నామని, మండలంలోని మధ్యాహ్న భోజన కార్మికులు పెద్ద ఎత్తున సమ్మెలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపు నిచ్చారు.ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు సురేందర్ రెడ్డి, మల్యాల గోవర్ధన్, మండల నాయకులు గోవింద్, షబానా, కోమలి తదితరులు పాల్గొన్నారు.
Spread the love