నవతెలంగాణ – హైదరాబాద్: బీఆర్ఎస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావుతో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ శనివారం భేటీ కానున్నారు. శనివారం ఉదయం 11 గంటలకు ఢిల్లీ నుంచి విమానంలో బయలుదేరి హైదరాబాద్లోని బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి నేరుగా ప్రగతిభవన్ వెళ్లి ముఖ్యమంత్రి కేసీఆర్తో ఆయన సమావేశం కానున్నారు. జాతీయ రాజకీయాలు, భారత సమాఖ్యస్ఫూర్తికి విరుద్ధంగా ప్రధాని నరేంద్రమోడీ నేతృత్వంలోని కేంద్ర బీజేపీ సర్కారు అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలపై ఇరువురు ముఖ్యమంత్రులు చర్చించనున్నారు. ఢిల్లీలో అధికారుల బదిలీ, పోస్టింగ్లపై కేంద్రం తెచ్చిన ఆర్డినెన్స్కు వ్యతిరేకంగా విపక్షాల మద్దతును ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రివాల్ కోరుతున్న విషయం తెలిసిందే. ఇరువురు సీఎంల భేటీ సందర్భంగా ఈ అంశంపై సుదీర్ఘంగా చర్చించే అవకాశాలున్నాయి. దేశ రాజధాని పరిధి ఢిల్లీలో గ్రూప్-ఏ అధికారుల బదిలీలు, నియామకాలు, క్రమశిక్షణ చర్యలు తదితర కీలక విషయాలను కేంద్రం తన పరిధిలోకి తీసుకున్నది.