కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అరెస్ట్

ఓఆర్​ఆర్​పై తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు
ఓఆర్​ఆర్​పై తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు

నవతెలంగాణ హైదరాబాద్: రాష్ట్రంలో కల్వకుంట్ల కుటుంబ పాలనలో ఎమర్జెన్సీ తరహా పరిస్థితులు ఏర్పడ్డాయని కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్​ రెడ్డి విమర్శించారు. ఆయన ఢిల్లీ నుంచి శంషాబాద్​ఎయిర్​పోర్ట్​కి చేరుకోగానే అక్కడే ఉన్న పోలీసులు ఆయన్ని అదుపులోకి తీసుకున్నారు. బాటసింగారం డబుల్​ బెడ్రూం ఇండ్ల పరిశీలనకు వెళ్లాలని బీజేపీ పిలుపునిచ్చిన నేపథ్యంలో పోలీసులు ఆ పార్టీ​ నేతలను ఎక్కడికక్కడ అరెస్టు చేస్తోన్నారు. బాటసింగారానికి వెళ్లేందుకు తమని అనుమతించాలని కిషన్​రెడ్డి పోలీసులను కోరినప్పటికీ, వారు నిరాకరించడంతో వర్షంలోనే రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. అనంతరం కేంద్ర మంత్రి కిషన్​ రెడ్డి, రఘునందన్​ రావులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటికే ఎమ్మెల్యే ఈటల రాజేందర్, సీనియర్​ నేత డీకే అరుణ తదితరులను హౌస్​ అరెస్ట్​ చేశారు. కిషన్ రెడ్డిని అదుపులోకి తీసుకోవడంతో శంషాబాద్​ ఓఆర్ఆర్ ​దగ్గర తీవ్ర ఉద్రిక్త నెలకొంది. ఈ క్రమంలో కిషన్​ రెడ్డి, ఎమ్మెల్యే రఘునందన్​రావు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. కార్యకర్తలను పోలీసులు ఎక్కడికక్కడ అరెస్టు చేసి పోలీసు స్టేషన్ కు తరలిస్తున్నారు. కేసీఆర్​ కుటుంబం జైలులో గదులు రెడీ చేసుకోవాలని డీకే అరుణ ఎద్దేవా చేశారు.

Spread the love