నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
లోక్సభ ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో మే 13న వేతనంతో కూడిన సెలవును రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ప్రభుత్వ, ప్రయివేటు కార్యాలయాలతో పాటు, విద్యాసంస్థలు, ఫ్యాక్టరీలు విధిగా సర్కార్ ఉత్తర్వులను అమలు చేయాలని సీఎస్ శాంతి కుమారి ఆదేశించారు. అన్ని జిల్లాల కలెక్టర్లు, ఇతర ప్రభుత్వ అధికారులు మే 13న వేతనంతో కూడిన సెలవు అమలు జరిగేలా చర్యలు తీసుకోవాలని సూచించింది. రాష్ట్రంలోని 17 లోకసభ నియోజక వర్గాలతో పాటు సికింద్రాబాద్ కంటోన్మెంట్ శాసన సభ ఎన్నికలకు ఈ సెలవు వర్తిస్తుందని పేర్కొంది.