ఫార్మా కంపెనీలో అగ్ని ప్రమాదం..50 మంది ప్రాణాలను కాపాడిన బాలుడు

నవతెలంగాణ-హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌లోని ఫార్మా కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం సంభవించిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో 50 మంది కార్మికులు మంటల్లో చిక్కుకున్నట్లు సమాచారం. అయితే, ఈ భారీ అగ్ని ప్రమాద సమయంలో ఓ బాలుడి సాహసం 50 మంది ప్రాణాలను కాపాడింది. స్థానికంగా నివసించే సాయిచరణ్ అనే ఓ బాలుడు భవనంలో చెలరేగిన మంటలను గుర్తించి వెంటనే భవనం పైకెక్కి తాడు కట్టాడు. ఈ తాడు సాయంతో భవనంలో ఉన్న కార్మికులు కిందకు దిగారు. లేకపోతే వారంతా అక్కడికక్కడే సజీవదహనమయ్యేవారు. 50 మంది సురక్షితంగా బయటపడటంతో జనాలు ఈ పిల్లాడిపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇక బిల్డింగ్‌లో మంటలు చెలరేగడానికి కారణం వెల్డింగ్ పనులేనని పోలీసలు గుర్తించారు. ఘటన స్థలంలో సహయక చర్యలు కొనసాగుతున్నాయి.

Spread the love