కుల్గామ్‌ ఎన్‌కౌంటర్.. ముగ్గురు ఉగ్రవాదులు మృతి

నవతెలంగాణ – హైదరాబాద్ : జమ్మూకశ్మీర్‌లోని కుల్గామ్‌ జిల్లాలో మంగళవారం భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య భారీ కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. రెడ్‌వానీ ప్రాంతంలో ఉగ్రవాదుల ఉన్నట్లు సమాచారం అందుకున్న భద్రతా దళాలు సోమవారం అర్ధరాత్రి నుంచి సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించాయి. ఈ క్రమంలో మంగళవారం నాటికి కూడా కొనసాగిన ఆపరేషన్‌లో ఇరు పక్షాల మధ్య కాల్పులు జరగ్గా భద్రతా బలగాలు ముగ్గురు ముష్కరులను హతమార్చాయి. అయితే వారి గురించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. అధికారులు వారు ఎవరనే దానిపై దర్యాప్తు చేస్తున్నారు.

Spread the love