నవతెలంగాణ-ఆలేరు టౌన్
ఆలేరు పట్టణంలో ఈనెల 20వ తేదీన జరుగు తెలంగాణ ప్రజానాట్యమండలి జిల్లా 3వ మహాసభ విజయవంతం చేయాలని, ప్రజానాట్యమండలి జిల్లా ప్రధాన కార్యదర్శి చెక్కవెంకటేష్ సంఘ సభ్యులకు పిలుపునిచ్చారు. ఆలేరు పట్టణంలో శుక్రవారం సిపిఐ పార్టీ కార్యాలయంలో కరపత్రం ఆవిష్కరించారు. మాహాసభకు కాన్రాజ్ శీను అధ్యక్షతన వహించారు. ఈ సందర్భంగా చెక్క వెంకటేష్ మాట్లాడుతూ కల కల కోసం కాదు, కల ప్రజల కోసం అని చెప్పారు. నైజాం పోరాటంలో పాటలు రాసి ఆటలాడి ప్రజలు చైతన్యం చేసి, భూమికోసం, భుక్తి కోసం తెలంగాణ విముక్తి కోసం జరిగిన పోరాటంలో తెలంగాణ ప్రజానాట్యమండలి కళాకారుల పాత్ర ఎంతో కీలకమన్నారు.
ప్రజానాట్యమండలి నూతన కమిటీ ఎన్నిక
ఆలేరు తెలంగాణ ప్రజానాట్యమండలి మహాసభ నూతన కమిటీ ఎన్నుకున్నారు. అధ్యక్షులు కాంట్రాక్ట్ శీను, ప్రధాన కార్యదర్శి పోతు ప్రవీణ్, ఉపాధ్యక్షులు సిఎచ్ రామానుజం, సహాయ కార్యదర్శి మోతే భవాని, కమిటీ సభ్యులు క్రాంతి, సుశీల, సంధ్య, రాజు, నర్సింలు, రవి తదితరులు పాల్గొన్నారు.
ప్రజానాట్యమండలి జిల్లా మహాసభను విజయవంతం చేయండి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



