నవతెలంగాణ-షాద్నగర్
చిల్కమర్రి గ్రామానికి బస్సు సౌకర్యం కల్పించడం పై బీఆర్ఎస్ గ్రామ కమిటీ అధ్యక్షులు కంటే శ్రీశైలం హర్షం వ్యక్తం చేశారు. ఫరూఖ్ నగర్ మండల పరిధిలోని చిల్కమర్రి గ్రామానికి ఎన్నో రోజుల నుండి బస్ సౌకర్యం లేక ప్రజలు ఎన్నో అవస్థలు ఎదుర్కొన్నారు. నూతనంగా రోడ్డు నిర్మాణం జరిగాక ఆర్టీసీ డిపో మేనేజర్ కు వినతి పత్రం అందజేయడంతో ఆమె స్పందించి ఆదివారం నుండి గ్రామానికి బస్సు రావడంతో గ్రామస్థులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ గ్రామ కమిటీ అధ్యక్షులు శ్రీశైలం మాట్లాడుతూ బస్సు సౌకర్యం కల్పించడంపై ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ కు, డిపో మేనేజర్కు కృతజ్ఞతలు తెలిపారు. ప్రతి రోజు ఉదయం షాద్ నగర్ నుండి హేమాజిపూర్ వరకు వయ చిల్కమర్రి బస్సు బయల్దేరుతుందని తెలిపారు. అలాగే సాయంత్రం కూడా బస్సు అందుబాటులో ఉంటుంది కాబట్టి ప్రజలు బస్సు సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ సత్యం, మాజీ ఉప సర్పంచ్ ఆనంద్, వార్డు సభ్యులు నరేష్, రవి, సుశీల, ఫీల్డ్ అసిస్టెంట్ శ్రీనివాస్, మాజీ సర్పంచ్ నర్సింహ, చంద్ర శేఖర్, బాల్ రాజ్, ఆంజనేయులు, భాను చందర్, శ్రీశైలం, నర్సింహ, హేమంత్, చెన్నయ్య, చెన్నయ్య, లక్ష్మయ్య, ఇస్తారి, ఆశన్న, శేఖర్, భిక్షపతి తదితరులు పాల్గొన్నారు.