వైన్స్ పర్మిట్ రూములో వ్యక్తి మృతి

నవతెలంగాణ – భిక్కనూర్
మండల కేంద్రంలోని వైన్స్ పర్మిట్ రూంలో మద్యం సేవిస్తూ వ్యక్తి మృతి చెందినట్లు సంఘటన చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికులు, కుటుంబీకులు తెలిపిన వివరాల ప్రకారం మోటాట్ పల్లి గ్రామానికి చెందిన సాయిలు గురువారం రాత్రి 10 గంటల సమయంలో మద్యం సేవించేందుకు వైన్స్ కు వచ్చి అక్కడ మద్యం తీసుకొని పర్మిట్ రూములోకి వెళ్లారు సమయం దాటి పోగా ఇంటికి వెళ్లాలని వాచ్మెన్ ఆయనకు సమాచారం ఇచ్చినప్పటికీ మరో క్వార్టర్ కావాలని చెప్పి పర్మిట్ రూములో కూర్చున్నారు. ఈ విషయాన్ని అక్కడ ఉన్న వాచ్మెన్ గమనించకుండా పర్మిట్ రూముకు తాళం వేసి వెళ్ళిపొయాడు. ఉదయం వచ్చిన సిబ్బంది పర్మిట్ రూములో సాయిలు మృతి చెందిన విషయాన్ని గమనించి పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న పోలీసులు, కుటుంబ సభ్యులు అక్కడికి చేరుకొని ఆందోళనకు దిగారు. అనంతరం వారిని పోలీసులు నచ్చ చెప్పడంతో శాంతించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏరియా ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసినట్లు సాయికుమార్ తెలిపారు.
Spread the love