సీఎంను కలిసిన మానాల మోహన్ రెడ్డి

నవతెలంగాణ – కంటేశ్వర్
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని నిజామాబాద్ జిల్లాకు చెందిన నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి తోపాటు ఎన్ఎస్యుఐ జిల్లా అధ్యక్షులు వేణు రాజ్ సోమవారం మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఎలాంటి సమస్యలు ఉన్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డికి ఎప్పటికప్పుడు సమాచారం ఇవ్వాలని, నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి తో పాటు ఎన్ ఎస్ యు ఐ జిల్లా అధ్యక్షులు వేణు రాజుకు సూచించారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ జిల్లాకు చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులతోపాటు తదితరులు పాల్గొన్నారు.
Spread the love