వరద బాధితులకు మానవ కళ్యాణ్ సేవాసమితి ఔదార్యం

నవతెలంగాణ -గోవిందరావుపేట
మండలం ప్రాజెక్ట్ నగర్ లో ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల వరదలకు గురి అయి నీట మునిగి ఇండ్లు కోల్పోయిన  59 కుటుంబాలకు మానవ కళ్యాణ్ సేవా సమితి (కాచిగూడ) హైదరాబాద్  సహాయ సహకారాలతో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ తెలంగాణ రాష్ట్ర పాలకమండలి సభ్యులు ములుగు జిల్లా కొత్తపల్లి ప్రసాదరావు వరద బాధితులకు ప్రతి కుటుంబానికి 3000/- రూపాయల విలువ గల  కిట్ పంపిణీ చేశారు.ఒక్కో వరద బాధిత కుటుంబానికి ఒకటార్పాలిన్, రెండు దుప్పట్లు, ఒక కార్పెట్, రెండు ఉక్కు థాలీలు, రెండు పెద్ద స్టీల్ గ్లాసులు, రెండు టీ స్టీల్ గ్లాసులు, రెండు చెంచాలు, రెండు అల్యూమినియం పాత్రలు, రెండు స్టీల్ గిన్నెలు, ఒక అల్యూమినియం కడాయి, ఒక అల్యూమినియం టీ పాత్ర, ఒక పత్తి టవల్, ఒక కాటన్ లుంగీ, మూడు ప్లాస్టిక్ కంటైనర్లు, ఒక బాటా స్లిప్పర్ చెప్పులు, ఒక 120 లీటర్ల వాటర్ క్యాన్, అర కిలోవాషింగ్ పౌడర్, నాలుగు రిన్ సబ్బులు, రెండు లైఫ్‌బాయ్ సబ్బులు, ఒక 100 గ్రాముల టూత్ పేస్ట్ లాంటి 20 రకాల  నిత్యావసర సరుకులను వరద బాధితులకు అందజేశారు.
Spread the love