చంద్రబాబును కలిసిన మంచు మనోజ్‌ దంపతులు

నవతెలంగాణ-హైదరాబాద్‌
తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడును సీనియాక్టర్‌ మంచు మనోజ్‌ దంపతులు సోమవారం హైదరాబాద్‌లో కలిశారు. దివంగత భూమా నాగిరెడ్డి రెండో కూతరు భూమా మౌనికారెడ్డిని మనోజ్‌ ఇటీవలే వివాహాం చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే పెండ్లీ అనంతరం నగరంలో బాబును కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు. మనోజ్‌ రాజకీయాల్లో వచ్చే అవకాశాలు ఉన్నాయనే ప్రచారం టీడీపీ శ్రేణుల్లో జరుగుతున్నది.

Spread the love