అతి త్వరలో భారీగా చేరికలు

నవతెలంగాణ -ఆర్మూర్:  ప్రజల సమస్యలు తీర్చేందుకు ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నానని ఆశీర్వదించి గెలిపించాలని అతి త్వరలో భారీగా చేరికలు సైతం ఉంటాయని బీజేపీ అభ్యర్థి పైడి రాకేష్ రెడ్డి సోమవారం తెలిపారు.  చౌడమ్మా కొండూరు ఎంపీటీసీ డి. రాజు, సహకార సంఘ డైరెక్టర్లు (మాజీ ఎంపీటీసీ )గుండు జీవన్, తోట సాయిలు, బీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు ఈశ్వర్ గౌడ్, మాజీ ఉపసర్పంచ్ నిరడి దేవిదాస్ తో పాటు కొండూరు, కొత్తూరు గ్రామానికి చెందిన 200మంది అనుచరులతో బీజేపీ లో చేరినారు.. ఈ సందర్భంగా కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎమ్మెల్యే అవినీతి కి అడ్డు చెప్పగల నాయకుడు త్వరలో వస్తున్నట్టు బీసీ ముఖ్యమంత్రి చేస్తా అన్న దమ్మున్న పార్టీ అని అన్నారు . అతి త్వరలో బీజేపీ లో భారిగా చేరికలు ఉంటాయి అని ప్రజాప్రతినిధులు అందరూ కలిసి రావాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ ఓడ్డే,న్న ముత్యం ఎస్సీ సెల్ అధ్యక్షుడు మెత్రి రాజు యాదవ సంఘం అధ్యక్షుడు నయికపొడు సంఘం అధ్యక్షుడు పోషేట్టి తదితరులు పాల్గొన్నారు.

Spread the love