కాంగ్రెస్ పార్టీలో భారీగా చేరికలు

– బీఆర్ఎస్, బీజేపీ, బిఎస్పీ 200 చేరిన  నాయకులు
– కాంగ్రెస్ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించిన
– రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ  మంత్రి శ్రీధర్ బాబు
నవతెలంగాణ – మల్హర్ రావు
మంథని,కాటారం రెండు డివిజన్ లలోని మల్హర్,కాటారం,మహాదేవపూర్, రామగిరి తదితర మండలాల్లో నుంచి బిఆర్ఎస్,బిజెపి,బీఎస్పీ పార్టీల నుంచి పలువురు కాంగ్రెస్ పార్టీలో భారీగా చేరారు.వారికి రాష్ట్ర ఐటి,పరిశ్రమల,శాసనసభ వ్యవహారాల మంత్రి దుద్దిళ్ల శ్రీదర్ బాబు కాంగ్రెస్ కండువాలు కప్పి సాధారణంగా ఆహ్వానించారు. కాంగ్రెస్ పార్టీలో చేరినవారిలో పెద్దపల్లి జిల్లా గ్రందాలయ మాజీ డైరెక్టర్ గుడిసె గట్టయ్య యాదవ్,బిఎస్పీ నియోజకవర్గ ఇంఛార్జి అట్టెం రమేష్,గుగ్గిళ్ల రాజ్ కుమార్,రమిల్ల రాకేష్,కందుగుల రాజన్న,అనిల్,మహేష్, సాగర్,శ్రీకాంత్, సుధాకర్ గౌడ్,మహేష్ గౌడ్,,రాజు,రమేష్,సదానందం,రోహిత్,నరసయ్య,రాజమల్లు,నాగరాజు తోపాటు దాదాపు 200 మంది  చేరారు.వారికి రాష్ట్ర ఐటి,పరిశ్రమల,శాసనసభ వ్యవహారాల మంత్రి దుద్దిళ్ల శ్రీదర్ బాబు కాంగ్రెస్ పార్టీ కండువాలు కప్పి సాధారణంగా ఆహ్వానించారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు ప్రభుత్వం ప్రవేపెడుతున్న ఆరు గ్యారంటీలపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ పార్టీ అభివృద్ధికి కృషి చేస్తూ,పెద్దపల్లి కాంగ్రెస్ పార్లమెంట్ అభ్యర్థి గడ్డం వంశీ గెలుపు కోసం కష్టపడాలని పిలుపునిచ్చారు.   ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు,నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.
Spread the love