మంత్రి వేముల సమక్షంలో బీఆర్ఎస్ లో భారీగా చేరికలు

– గులాబీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించిన మంత్రి 
 నవతెలంగాణ – కమ్మర్ పల్లి 
సీఎం కేసిఆర్ జనరంజక పాలన, బాల్కొండ నియోజకవర్గంలో జరిగిన అభివృద్ది,సంక్షేమ పథకాలకు ఆకర్షితులై నియోజకవర్గం లోని వివిధ గ్రామాలకు చెందిన ముఖ్య నాయకులు, యువకులు ఇతర పార్టీ కార్యకర్తలు రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సమక్షంలో బుధ వారం బీఆర్ఎస్ పార్టీలో చేరారు. పార్టీలో చేరిన వారిలో ముప్కాల్ మండలం నల్లూర్ గ్రామం నుండి కాంగ్రెస్, బీజేపీ కి చెందిన యువజన సభ్యులు, భీంగల్ మండలం బెజ్జోరా గ్రామానికి చెందిన బిజెపి నాయకులు మూడెడ్ల లింబాద్రి, మాజీ వార్డు సభ్యురాలు వాసవి, భీంగల్ మండలం ముచ్కూర్ గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకులు ముత్యాల గంగాధర్ బిఆర్ఎస్ పార్టీలో చేరారు.వేల్పూర్ మండలం కుకునూర్ గ్రామానికి చెందిన లౌలి ఫ్రెండ్స్ యూత్, పవర్ యూత్ సభ్యులు మంత్రి సమక్షంలో  గులాబీ కండువా కప్పుకున్నారు.వారికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి మంత్రి సాదరంగా ఆహ్వానించారు.
మంత్రి వేములకు మద్దతుగా ఏకగ్రీవ తీర్మానాలు 
బాల్కొండ నియోజకవర్గ నలుమూలల అన్ని గ్రామాల నుండి మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డికి ప్రజల్లో విశేష ఆదరణ లభిస్తోంది. పలు కుల సంఘాలు, యువజన సంఘాలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఎన్నికల్లో సంపూర్ణ మద్దతు తెలుపుతూ ఏకగ్రీవ తీర్మానాలు చేస్తున్నారు. అందులో భాగంగా వేల్పూర్ మండల కేంద్రానికి చేసిన కేసీఆర్ కాలనీ ప్రజలందరు, వెంకటాపూర్ గ్రామానికి చెందిన జక్కుల, ధన రెక్కల యాదవ సంఘం సభ్యులు ఏకగ్రీవ తీర్మానము చేశారు. అభివృద్ది ప్రదాత వేముల ప్రశాంత్ రెడ్డికే మా ఓటు అంటూ  ముక్త కంఠంతో నినదించారు. అందుకు సంబంధించిన తీర్మాన పత్రాలు మంత్రికి అందజేశారు. తనకు మద్దతుగా ఏకగ్రీవ తీర్మానం చేయడం పట్ల మంత్రి వేముల హర్షం వెలిబుచ్చారు. వారి అభిమానానికి హృదయ పూర్వక ధన్యవాదాలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు,బిఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Spread the love