మేడే కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి

– భవన నిర్మాణ రంగాల కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు ధర్పల్లి చంద్రం. 
నవతెలంగాణ – తొగుట
మే 1వ తేదీన బీఎన్ఆర్కెఎస్ ఆధ్వర్యంలో మేడే కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని భవన నిర్మాణ రంగాల కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు ధర్పల్లి చంద్రం ఆన్నారు. శనివారం మండల కేంద్రం తొగుటలో విలేకరులతో మాట్లాడుతూ “మే 1న బీఎన్ఆర్కెఎస్ ఆధ్వర్యంలో 14 రంగాల భావన నిర్మాణ కార్మికులు పాల్గొని మేడేను విజయవం తం చేయాలని కోరారు. కార్మికుల హక్కుల సాధ నకై నిరంతరం ఉద్యమాలు చేపడతామని అన్నా రు. కార్మికుల హక్కులు సాదించాలంటే ఉద్యమా ల ద్వారానే సాధ్యం అవుతుందని తెలిపారు. గతంలో మహా మహా విప్లవ మేధావులు కూడా ఎన్నికల్లో పాల్గొని కార్మికులకు ఎలాంటి మేలు చేయలేదని విమర్శించారు. కార్మికుల కావలసిన పతి హక్కుగా ఉద్యమాలు చేయాల్సిన అవసరం ప్రతి కార్మికుడిపై ఉందని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అల్వాల కృష్ణ గౌడ్, ఆకుల ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.
Spread the love