అమెరికాలో రేవంత్ రెడ్డి ఉచిత విద్యుత్ వాక్యాలను వక్రీకరించిన మంత్రి కేటీఆర్

– ఈ రాష్ట్రంలో ఉచిత విద్యుత్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీనే
– పిసిసి కార్యనిర్వాహక అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్
నవతెలంగాణ -కంటేశ్వర్
పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి మాట్లాడిన ఉచిత విద్యుత్ వాక్యాలను వక్రీకరించిన మంత్రి కేటీఆర్ మాటలకు స్పందిస్తూ మంగళవారం  పిసిసి కార్యనిర్వాహక అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ.. కేటీఆర్ రేవంత్ రెడ్డి  మాటల్లోని పూర్తి సారాంశాన్ని అర్థం చేసుకోకుండా రైతులను, ప్రజలను ఉసగొల్పేలా మాట్లాడుతూ దిగజారిపోతున్నాడని, రేవంత్ రెడ్డి  అన్నది రాష్ట్రంలో సగటున మెజారిటీ ఉన్న రైతులు మూడు ఎకరాల లోపు వారని, ఎకరానికి గంట చొప్పున ఉచిత విద్యుత్ ఇస్తే మూడు ఎకరాలకు మూడు గంటల ఉచిత విద్యుత్ తో పాటు ఐదు గంటలను కలిపి రాష్ట్రంలో 8 గంటల ఉచిత విద్యుత్ ఇవ్వాలని వాక్యాలు చేశారే తప్ప ఉచిత విద్యుత్ను ఎత్తేస్తామని రేవంత్ రెడ్డి మాట్లాడలేదని ఆయన అన్నారు.ఈ రాష్ట్రంలో ఉచిత విద్యుత్తు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అని, పవర్ ప్రొడక్షన్ ప్రాజెక్టులు నిర్మించింది పునాదులు వేసింది కాంగ్రెస్ పార్టీ అని ఆయన అన్నారు. రైతులకు ఉచిత విద్యుత్ ఇవ్వడంలో రాష్ట్ర ప్రభుత్వం అవినీతికి పాల్పడిందని ,ఒక రూపాయికి రాష్ట్రంలో విద్యుత్ ప్రొడ్యూస్ అవుతే టిఆర్ఎస్ ప్రభుత్వం ఎందుకు వేరే రాష్ట్రాల నుండి రెండు రూపాయలకు కొనుగోలు చేస్తుందని, ఆ ఒక్క రూపాయి మార్జిన్ అనేది టిఆర్ఎస్ ప్రభుత్వం కమిషన్ తీసుకుంటుందని, ఉచిత విద్యుత్ పేరుతో రైతులను రాష్ట్ర ప్రభుత్వం నిండా ముంచుతుందని ఆయన అన్నారు. టీఎస్ జెన్కో మరియు టీఎస్ ట్రాన్స్కోలలో రాష్ట్ర ప్రభుత్వం అవినీతికి పాల్పడిందని, కాంగ్రెస్ పార్టీ రైతులకు ఎప్పుడు అండగా ఉండే పార్టీ అని, రాష్ట్రంలో టిఆర్ఎస్ ప్రభుత్వం వరిని 2060 రూపాయలకు కొనుగోలు చేస్తే చత్తీస్గఢ్లో కాంగ్రెస్ ప్రభుత్వం 2650 రూపాయలకు కొనుగోలు చేస్తుందని, రైతు డిక్లరేషన్ లో కాంగ్రెస్ పార్టీ పసుపు పంటకు మద్దతు ధర ప్రకటించిందని ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం పసుపు కు ధర ప్రకటించడం లేదని ఈ సందర్భంగా ప్రశ్నించారు. టిఆర్ఎస్ నాయకులు రైతుల్లో వస్తున్న వ్యతిరేకతను గమనించి రేవంత్ రెడ్డి గారు చేసిన వాక్యాలను వక్రీకరిస్తున్నారని, బీజేపీ ప్రభుత్వం రైతు వ్యతిరేక చట్టాలను తెచ్చినప్పుడు దానికి మద్దతు పలికిన బిఆర్ఎస్ పార్టీ ఏ విధంగా రైతులకు ముఖం చూపెడుతుందని, ఈ దేశంలో రైతుల పక్షాన పోరాడే పార్టీ రైతుల మేలు గురించి ఆలోచించే ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ అని మహేష్ కుమార్ గౌడ్ అన్నారు.
Spread the love