నవతెలంగాణ – హుస్నాబాద్: కాంగ్రెస్ నేతలు అన్ని వర్గాలను మోసం చేశారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్రావు విమర్శించారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో ఎంపీ అభ్యర్థి వినోద్ కుమార్కు మద్దతుగా నిర్వహించిన ప్రచార కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. మహిళలకు నెలకు రూ.2,500 ఇస్తామన్నారని.. 5 నెలలవుతున్నా దిక్కులేదని విమర్శించారు. ప్రస్తుత ప్రభుత్వం రివర్స్ గేర్లో నడుస్తోందని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ హయాంలో విద్యుత్ నిరంతరం ఉండేదని.. ఇప్పుడు నిత్యం సరఫరా నిలిచిపోతోందన్నారు. రైతులు, నిరుద్యోగులను ఈ ప్రభుత్వం మోసం చేసిందని విమర్శించారు.