తమ్మినేని వీరభద్రంను పరామర్శించిన మంత్రి పొంగులేటి..

నవతెలంగాణ – హైదరాబాద్: లంగ్స్ ఇన్ఫెక్షన్ తో బాధపడుతూ హైదరాబాద్ లోని ఓ ప్రయివేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రంను రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పరామర్శించరు. తమ్మినేని ప్రస్తుత ఆరోగ్య పరిస్థితిని డాక్టర్లను అడిగి ఆయన తెలుసుకున్నారు. మెరుగైన వైద్య సేవలు అందించి త్వరగా కోలుకునేలా కృషి చేయాలని డాక్టర్లకు సూచించారు. పొంగులేటి వెంట ఖమ్మం జిల్లా మాజీ డీసీసీబీ చైర్మన్ మువ్వా విజయబాబు, సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు బి. వెంకట్ తమ్మినేని కూమారుడు సంఘమిత్ర తదితరులు ఉన్నారు.

Spread the love