మృతుని కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే డాక్టర్ భూక్యమురళి నాయక్ 

నవతెలంగాణ – నెల్లికుదురు
మండలంలోని వావిలాల గ్రామానికి చెందిన యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు గోగుల అశోక్ నీ తల్లి అయినా గోగుల వీరమ్మ ఇటీవల మృతి చెందగా, ఆమె కుటుంబాన్ని సందర్శించి పరామర్శించినట్లు మహబూబాద్ ఎమ్మెల్యే డాక్టర్ భూక్య మురళి నాయక్ తెలిపారు. ఆదివారం ఆ కుటుంబాన్ని సందర్శించి సంఘీభావం నివాళులర్పించి, కుటుంబ సభ్యులకు మనోధైర్యం నింపే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆమె మృతి బాధాకరమని అన్నారు. ఆమె అందరితో మంచిగా కలిసిమెలిసి ఉండి కష్టసుఖాల్లో పాలు పంచుకొని కొన్ని కుటుంబాలను అప్పట్లో ఆదుకుందని అన్నారు. అలాంటి గొప్ప వ్యక్తి మృతి చెందడం బాధాకరమైన తెలిపారు మృతి చెందిన కుటుంబాన్ని ఆదుకునేందుకు తన వంతు కృషి చేస్తానని కుటుంబ సభ్యులకు హామీ ఇచ్చినట్లు తెలిపారు. మృతి చెందిన కుటుంబాలకు ప్రతి ఒక్కరు అండగా నిలవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు గొల్లపల్లి ప్రభాకర్ గౌడ్ జిల్లా మండల గ్రామ నాయకులు కాసం లక్ష్మారెడ్డి, నలమాస తోతాద్రి ,మది రాజేష్, పులి వెంకన్న ,కొంపల్లి శ్రీశైలం, వెన్నం క్రాంతి రెడ్డి ,నల్లమాస బిక్షపతి ,బొల్లెపల్లి సతీష్, జాటోత్ వీరన్న ,సుందర్, పాల్గొన్నారు.

Spread the love