![](https://navatelangana.com/wp-content/uploads/2024/06/IMG-20240614-WA0032.jpg)
భువనగిరి పట్టణంలో నమాత్ పల్లి గ్రామం లక్ష్మి నరసింహ స్వామి ఆలయానికి వెళ్ళే దారి మల్లెవాని చెరువు కట్ట వెడల్పు చేయుటకు ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డికి ఎల్లంల జంగయ్య యాదవ్ కలిసి పరిశీలించారు. అనంతరం గ్రామ సమస్యలపై ఎమ్మెల్యేకు వినతిపత్రం అందజేశారు. ఇరిగేషన్ నిధులనుంచి మంజూరు చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మట్ట శంకర్ బాబు గౌడ్, ఎల్లంల వెంకటేశం, కొండాపురం చంద్రమౌళి, కొండాపురం గణేష్ లు పాల్గొన్నారు.