శ్రీ కంట మహేశ్వర స్వామి దేవాలయాన్ని సందర్శించిన ఎమ్మెల్యే సీతక్క

నవతెలంగాణ- గోవిందరావుపేట
మండలంలోని మొద్దుల గూడెం గ్రామం లోని గౌడ కులస్తుల దైవం శ్రీ కంట మహేశ్వర స్వామి దేవాలయాన్ని ఏఐసీసీ జాతీయ మహిళా ప్రధాన కార్యదర్శి మరియు ములుగు నియోజకవర్గ ఎమ్మెల్యే దనసరి సీతక్క గురువారం సందర్శించి పూజాది కార్యక్రమాలు నిర్వహించారు, ప్రజలందరూ ఎల్లప్పుడూ పాడిపంటలతో, సుఖ సంతోషాలతో, పిల్లాపాపలతో, అష్టైశ్వర్యాలతో ఉండాలని కోరుకుంటూ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ గోవిందరావుపేట మండల అధ్యక్షులు పాలడుగు వెంకటకృష్ణ, సహకార సంఘ అధ్యక్షులు పన్నాల ఎల్లారెడ్డి, మండల ఇంఛార్జి కొంపెల్లి శ్రీనివాస్ రెడ్డి, జెట్టి సోమయ్య, ఎంపీటీసీ గోపిదాసు ఏడుకొండలు, సర్పంచ్ భూక్య సుక్య, ఉపసర్పంచ్ బద్దం లింగారెడ్డి, కాడబోయిన రవి, బర్ల సమ్మిరెడ్డి, తండా రవి, జంపాల చంద్రశేఖర్, జక్కు రణదీప్, మిరియాల యాదగిరి రెడ్డి, సామ సమ్మిరెడ్డి, గాజుల నారాయణ తదితరులు పాల్గొన్నారు.

Spread the love