మున్సిపల్ కార్పొరేషన్ బిల్డింగ్లను పరిశీలించిన ఎమ్మెల్యేలు

నవతెలంగాణ- కంటేశ్వర్
నేడు రాష్ట్ర ఐటీ శాఖ,పురపాలక శాఖ మంత్రివర్యులు కల్వకుంట్ల తారకరామారావు  చేతుల మీదుగా  ప్రారంభించనున్న  ఐటీ హబ్, ఎన్ ఎ సి బిల్డింగ్, దుబ్బ వైకుంఠధామం, నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ బిల్డింగ్ లను స్థానిక నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే  బీగాల గణేష్ గుప్తాతో  కలిసి పరిశీలించిన రాష్ట్ర ఆర్టీసీ చైర్మన్ నిజామాబాద్ గ్రామీణ శాసనసభ్యులు బాజిరెడ్డి గోవర్ధన్ జిల్లా యువ నాయకులు జిల్లా ఒలంపిక్ ఉపాధ్యక్షులు ధర్పల్లి జెడ్పిటిసి బాజిరెడ్డి జగన్మోహన్  పరిశీలించారు. ఈ కార్యక్రమంలో వారితో పాటు ఉమ్మడి జిల్లాల డిసిఎంఎస్ చైర్మన్ సాంబారి మోహన్ , స్థానిక కలెక్టర్ రాజీవ్ గాంధీహనుమంతు , వివిధ శాఖల అధికారులు, బి ఆర్ ఎస్ పార్టీ ప్రజా ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.
Spread the love