కేసీఆర్ ప్రభుత్వంలోనే సంక్షేమ పథకాలు అందాయి: ఎంపీపీ దశరథ్ రెడ్డి

నవతెలంగాణ – రామారెడ్డి
కేసీఆర్ ప్రభుత్వం హయాంలోనే ప్రజలకు సంక్షేమ పథకాలు అందాయని బుధవారం స్థానిక ఎంపీపీ నా రెడ్డి దశరథ్ రెడ్డి, అన్నారు. మండలంలోని అన్నారం గ్రామ పరిధిలో ఉపాధి హామీ కూలీల వద్ద ఎన్నికల ప్రచారాన్ని బి ఆర్ ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… కాంగ్రెస్ ప్రభుత్వం మోసపూరిత హామీలతో గద్దెనెక్కి, ప్రజలకు సంక్షేమ పథకాలను అమలు చేయక, కాలయాపన చేస్తుందని అన్నారు. తెలంగాణను సాధించి, రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించిన బి ఆర్ ఎస్ కు మద్దతు తెలుపుతూ, కారు గుర్తుకు ఓటు వేసి జహీరాబాద్ నియోజకవర్గ అభ్యర్థి గాలి అనిల్ కుమార్ ను గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో మండల యువజన అధ్యక్షులు గడ్డం రవీందర్ రెడ్డి, నాయకులు కూడెల్లి బాలరాజు, కుమ్మరి మురళి, పోచయ్య, లక్ష్మణ్, శంకర్, రాములు, నారాయణ తదితరులు పాల్గొన్నారు.
Spread the love