సర్పంచ్ ఎల్లారెడ్డికి నగదు అందజేస్తున్న ఎంపీపీ రేణుకా తిరుపతి రెడ్డి

నవతెలంగాణ- వీణవంక
మండలంలోని మల్లారెడ్డిపల్లి గ్రామంలో భూలక్ష్మి మహాలక్ష్మి అమ్మవార్ల విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో ఎంపీపీ ముసిపట్ల రేణుక తిరుపతి రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా రూ. లక్ష ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మేకల ఎల్లారెడ్డి, ఉప సర్పంచ్ బిక్షపతి, వార్డ్ మెంబర్లు, మాజీ సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి, సమ్మిరెడ్డి, శంకర్ రెడ్డి, విద్యాసాగర్, కోమల్ రెడ్డి గ్రామ యువకులు, ప్రజలు పాల్గొన్నారు.

Spread the love